తెలంగాణహైదరాబాద్

ఉప్పల్ బగాయత్‌లో దారుణం.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఓ మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు కారుతో ఢీకొట్టి మరీ హత్య చేశాడు. మృతురాలు కొమ్మవారి మంజుల(40) గా గుర్తించారు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి.. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు. అదే రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో రామంతపూర్‌కి చెందిన కొమ్మవారి మంజుల పనిచేస్తుంది. చంద్రమౌళికి మంజులతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయంతోనే చంద్రమౌళి దగ్గర నుంచి మంజులు రూ.28 లక్షలు తీసుకునట్టు సమాచారం. అయితే గత 3 నెలల నుంచి మంజుల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో చంద్రమౌళి ఆమెపై పగ పెంచకున్నాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. ఆపై హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి మహిళను కారులో ఎక్కించుకుని.. ఉప్పల్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడే కారుతో ఢీకొట్టి, హత్య చేసి అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి : 

  1. గాంధీ హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే!!
  2. నేటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు.. కొత్తచట్టం ప్రకారం సామూహిక అత్యాచారానికి మరణశిక్ష
  3. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
  4. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు వసూళ్ల కాంట్రాక్ట్ నుండి వైదొలగిన జీఎమ్మార్ సంస్థ…
  5. లక్కీ యెస్ట్ ఫెల్లో.. ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి!!

Related Articles

Back to top button