జాతీయంతెలంగాణ

కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయినట్లు సమాచారం. దీంతో అధికారులు వెంటనే జైలు నుంచి దీన్ఐయాల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. కవితకు ఏమైందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె ఇప్పటికే వంద రోజులకు పైగా తీహార్ జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. కవిత ఆరోగ్య పరిస్థితిపైన కుటుంబ సభ్యులతో పాటు బిఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button