తెలంగాణ

ఖమ్మం మంత్రులే నల్గొండ రైతులను నీళ్లలో ముంచేశారు

ఖమ్మం, నల్గొండ జిల్లాలో వరద విలయంపై రాజకీయ రగడ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ముగిసిన వెంటనే వరద ప్రాంతాలకు వెళ్లింది బీఆర్ఎస్ బృందం. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద ప్రాంతాలను పరిశీలించారు. సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన హరీష్ రావు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.

ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి అన్నారు.ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కెసిఆర్ గారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని.. ఓదార్పు కొచ్చారా సంబరాలకు వచ్చారా అర్థం కాలేదని విమర్శించారు. సాగర్ కాల్వకట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమేనని.. ఇందుకు రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారని చెప్పారు జగదీశ్ రెడ్డి.

ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వర్ధవ వచ్చినప్పుడు గేట్లు తెచ్చుకోలేక ప్రెషర్కు కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారని తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందని చెప్పారు. ఖమ్మంలో వరదలో కొట్టుకుపోయి ప్రజలు చనిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు.

9 గంటలు సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చీకటి పడ్డాక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాల్లో మునిగితేలుతున్నారని తెలిపారు.ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం.. ప్రకృతి సృష్టించిన విలయం కాదని తేల్చి చెప్పారు. పంట నష్టపోవడమే కాక మరో రెండు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడ రైతులు తమపొలాలను బాగుచేస్తే చాలు మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయి రాళ్లు రంపలతో పొలాలు నిండిపోయాయని అన్నారు.

గతంలో ఇలాంటివి సమయంలో కేసీఆర్ గారు నిద్రపోకుండా మంత్రులందరిని ప్రజల్లో ఉంచి పని చేయించేవారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని రైతులు అంటున్నారని.. ఇక్కడ జరిగిన నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లు ఇవని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button