క్రైమ్తెలంగాణ

గంజాయి మత్తులో తల్లిని ముక్కలుగా నరికిన కొడుకు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా హత్యలు, అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయి. గంజాయి మత్తులో యువకులు ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. నగరంలో రోజూ ఏదో ఒక చోట గంజాయికు అలవాటుపడిన వాళ్లు చేసే కిరాతకాలు వెలుగు చూస్తున్నాయి.తాజాగా జీడిమెట్లలోని కుత్బుల్లాపూర్ లో అమానుషం జరిగింది. గంజాయి మత్తులో తల్లిని తలపై కత్తితో పొడిచి నరికి చంపాడు ఓ యువకుడు.

కుత్బుల్లాపూర్ కు చెందిన పెద్ది జయమ్మకు 63 ఏళ్లు. ఆమెకు ఐదుగురు ఆడపిల్లలు. మగపిల్లలు పుట్టరని భావించిన స్వామి-జయమ్మ దంపతులు మూడు నెలల పసికందుగా ఉన్న వేణును తెచ్చి పెంచుకున్నారు. కొన్ని రోజులకు వారికి మగపిల్లాడు పుట్టాడు. అయినా వేణును అతనితో సమానంగానే పెంచారు. వేణుకు పెళ్లికూడా చేశారు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొన్ని రోజులుగా వేణు గంజాయికి బానిసయ్యాడు. రోజూ తల్లిదండ్రులు, భార్యతో గొడవడేవాడు. దాంతో అతని భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ వేణు మారలేదు. డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరుచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో గంజాయి తాగి మత్తులో ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిని వేధించాడు.

జయమ్మను విచక్షణారహితంగా కొట్టి, డోరు వెనుక వైపు ఉంచే ఇనుప చువ్వతో ఆమె తలలో పొడిచి హత్యచేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జయమ్మ సొంత కొడుకు వినోద్​ ఏడాదిన్నర క్రితం కనిపించకుండా పోయాడు. వేణు పెంపుడు తల్లిని హత్య చేయడంతో వినోద్​ ను కూడా అతడే చంపేశాడోమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button