తెలంగాణహైదరాబాద్
Trending

తెలంగాణ ఏసీబీ చేతికి అవినీతి తిమింగలం చిక్కింసి.

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ ఏసీబీ చేతికి అవినీతి తిమింగలం చిక్కింసి. ఏకంగా డిప్యూటీ కలెక్టర్ నే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు‌ ఏసీబీ అధికారులు. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసింది ఏసిబి టీమ్. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరార బాధితుడు. అయితే ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు. సీనియర్ అసిస్టెంట్. దీంతో ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేశాడు సీనియర్ అసిస్టెంట్. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడారు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇద్దరిని అరెస్ట్ చేసింది ఏసీబీ. లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ ఏసీబీకి దొరకడం కలకలం రేపుతోంది.

Related Articles

Back to top button