తెలంగాణ

త్వరలోనే సీఎంగా ఉత్తమ్.. బాంబ్ పేల్చిన కోమటిరెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగనుందా..? కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని ట్విస్ట్.. ఇవ్వబోతుందా అంటే తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ లో ఏదో జరగబోతుందనే టాక్ వస్తోంది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ బాంబ్ పేల్చారు సీనియర్ లీడర్ రాజగోపాల్ రెడ్డి. తన నాలుక పై నల్లటి మచ్చలు ఉన్నాయని.. నేను చెప్పింది వంద శాతం నిజం అవుతుందని అన్నారు. మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఉత్తమే సీఎం అవుతారని కామెంట్ చేయడం కాంగ్రెస్ లో పెను సంచలనంగా మారింది.

ఇటీవల కాలంలో తరుచూ ఢిల్లీ వెళుతున్నారు ఉత్తంకుమార్ రెడ్డి. పార్టీ పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ, మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏదో సంచలనం నిర్ణయం తీసుకోనుందా అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు చర్చగా మారాయి. మరోవైపు మంత్రివర్గ రేసులో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనకు కేబినెట్ బెర్త్ దక్కేలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాకా పడుతున్నారనే టాక్ కూడా వస్తోంది. రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారనే వార్తలు వచ్చాయి. అందుకే ఉత్తమ్ నుంచి తనకు లైన్ క్లియర్ అయ్యేలా రాజగోపాల్ రెడ్డి తాజా కామెంట్లు చేశారంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button