తెలంగాణ
Trending

ఫాంహౌజ్‌లో కేసీఆర్ రహస్య పూజలు!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం చేస్తున్నారు. ఎర్రవ‌ల్లి ఫాంహౌజ్ లో నిర్వహిస్తున్న యాగంలో కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ఉన్నారు. ఆమె కూడా యాగంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జాతక‌ రిత్యా ఏదీ క‌లిసి రాన‌ప్పుడు శాంతి హోమాలు చేస్తుంటారు కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్ న‌వ‌గ్రహ హోమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తొమ్మిది గ్రహాల‌కు తొమ్మిది ర‌కాల పూల‌తో ఈ పూజ‌లు నిర్వహిస్తారు. త‌మ‌కు ఉన్న దోశాలు పోవాల‌ని, గ్రహ‌బ‌లం పెర‌గాల‌న్న ఉద్దేశంతో ఈ యాగం లేదా హోమం చేస్తార‌ని పండితులు చెబుతున్నారు. కొంత‌ కాలంగా త‌రుచూ కేసీఆర్ అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి , కూతురు కవిత జైలుకు వెళ్లడం జరిగాయి. తనకు కాలం క‌లిసిరావ‌ట్లేద‌న్న ఉద్దేశంతో కేసీఆర్ దంప‌తులు ఈ యాగాన్ని జరిపిస్తున్నట్లు సమాచారం. కుటుంబానికి చెందిన అతికొద్ది మంది స‌మ‌క్షంలో ఈ పూజ‌లు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.

కీల‌క ప‌నులు మొద‌లుపెట్టే ముందు యాగాలు, పూజ‌లు చేయటం కేసీఆర్‌కు అల‌వాటు. ఈనెల 11 నుండి కేసీఆర్ ప్రజ‌ల్లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫాంహౌజ్ లో కేసీఆర్ న‌వ‌గ్రహ యాగం చేస్తున్నారని తెలుస్తోంది. 2014లో తెలంగాణకు ముఖ్యమంత్రి కాగానే మూడు రోజుల పాటు చండీయాగం చేశారు గులాబీ బాస్. గత అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామ‌ల యాగం నిర్వహించారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఎక్కడో త‌ప్పు జ‌రిగింద‌న్న ఉద్దేశంతో మ‌ళ్లీ దోష నివార‌ణ పూజ‌లు చేశారు. తాజాగా ఇప్పుడు మ‌రోసారి న‌వ‌గ్రహ పూజ‌లతో పాటు యాగాలు నిర్వహిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button