తెలంగాణ

బస్సు ఆపి కండక్టర్ తమ్ముడికి రాఖీ కట్టిన‌ అక్క

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి :  డ్యూటీలో ఉన్న సోదరుడికి రాఖీ పండగ సెలవు దొరకలేదు.. ఏటా రాఖీ కట్టే సోదరి సరస్వతి ఈ ఏడాది ఆ ఆనవాయితీని కొనసాగించాలనుకుంది. దీంతో బస్సు వెళ్లే దారిలో వేచి చూసి అందులో ఎక్కింది. తమ్ముడు కృష్ణమూర్తి నుదుటిన బొట్టు పెట్టి ప్రేమగా రాఖీ కట్టింది. బస్సులో వున్న ప్రయాణికులంతా ఈ దృశ్యాన్ని వీక్షించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

భూపాలపల్లి కాళేశ్వరంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button