తెలంగాణ

బుల్డోజర్లు తెప్పిస్తా.. ఒవైసీ కాలేజీని కూల్చేయండి..

హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో రాజకీయ సెగులు రేపుతున్నాయి. హైడ్రాకు మద్దతు పెరుగుతుండగా.. అదే సమయంలో కూల్చివేతలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రాకు దమ్ముంటే ఆ కట్టడాలను కూల్చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ కు దమ్ముంటే పాతబస్తీలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. కొంతమంది టార్గెట్‌గా హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోందన్నారు. ఇంత హంగామా చేస్తున్న హైడ్రా అధికారులకు సల్కం చెరువు మధ్యలో కట్టిన ఒవైసీ బ్రదర్స్ భవనాలను కూల్చే దమ్ముందా అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాలు హైడ్రాకు కనిపించకుంటే తానొచ్చి చూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర జేసీబీలు లేకుంటే.. పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

అసలైన అక్రమ కట్టడాలను కూల్చకుండా హైడ్రాతో హంగామా చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పాతబస్తీలోని గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు అక్రమ నిర్మాణాలు హైడ్రాకా తెలియవా అని నిలదీశారు. ఓల్డ్ సిటీలో ఇష్టానుసారంగా చెరువు గుట్టలను కబ్జా చేశారని తెలిపారు.దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలని ఏలేటి సవాల్ చేశారు. భవంతులు కూల్చడమే కాదు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదా భూములు లెక్కలు తీయాలన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటన్నారు మహేశ్వర్ రెడ్డి. ఒవైసీ బ్రదర్స్ కు సిగ్గుంటే మీ కట్టడాలు మీరే కూల్చేయాలని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
—–

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button