తెలంగాణ

ముహుర్తం ఫిక్స్..మల్లారెడ్డి అల్లుడి కాలేజీ కూల్చివేత ఎప్పుడంటే.!

హైడ్రా దూకుడుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టడాలు నిర్మించిన అక్రమార్కులు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. చెరువులను కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టారని కొందరు ఆధారాలతో సహా హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో మల్లారెడ్డి కాలేజీలతో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తాయనే ప్రచారం సాగుతోంది.

మర్రి రాజశేఖర్ రెడ్డిచి చెందిన MLRIT , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.దుండిగల్ పరిధిలో ఉన్న చిన్నదామెర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం జరిగిందని.. దీనికి సంబంధించి మీ వివరణ ఏంటీ అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు. చిన్నదామెర చెరువునకు చెందిన 8 ఎకరాల 24 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. సర్వే నెంబర్లు 489, 485, 458, 484, 492, 489 భూముల్లో భవనాలు, షెడ్స్, వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని.. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 7 రోజుల్లో కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు.

రెవిన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టకుండా హైకోర్టును ఆశ్రయించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మల్లారెడ్డి అల్లుడికి స్వల్ప ఊరట కల్పించింది. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ లో నిర్మాణాలపై ఏడు రోజుల వరకు స్టే విధించింది. సంబంధిత డాక్యుమెంట్లతో ఏడు రోజుల్లోగా స్థానిక ఎమ్మార్వోను కలసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. మర్రి వివరణ తర్వాత చట్టప్రకారం ముందుకు వెళ్లాలని తహసీల్దార్‌ ను ఆదేశించింది. ఈ ఏడు రోజుల వరకు మ్రరి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు సంబంధించి ఎలాంటి కూల్చివేత చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

భూమిని సర్వే చేయకుండా గండిమైసమ్మ ఎమ్మార్వో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టులో వాదించారు రాజశేఖర్ రెడ్డి న్యాయవాదులు. విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలను కూల్చివేయడం లేదని, సెలవుల్లో మాత్రమే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చేసిన ప్రకటనను కోర్టు దృష్టికి తెచ్చారు మర్రి తరపు న్యాయవాదులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button