తెలంగాణనల్గొండ

రోడ్డుపై నాట్లు వేసి బిజెపి నాయకులు నిరసన

చండూరు, క్రైమ్ మిర్రర్ : చండూరు మున్సిపాలిటీలో ఆగిన రోడ్డుపనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం కస్తాల చౌరస్తాలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో వరి నారు నాట్లు వేసి వినూత్నగా నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల కావస్తున్నా రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం చూస్తుంటే ప్రజా సమస్యలపై పరిష్కారంపట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం సమీక్షల పేరుతో కాలం వెల్లదిస్తున్నారు తప్ప పనులు పూరి చేయటంలో చిత్త శుద్ధి కనబరచటం లేదన్నారు. గతంలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆర్ డి ఓ కు,ప్రజావాణిలో పిర్యాదు ఇచ్చామని అయినప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, భూతరాజు శ్రీహరి, అన్నపర్తి యాదగిరి , రావిరాల శ్రీనివాసులు, చిలుకూరి అశోక్, తిరందాసు దామోదర్, ఇరిగి ఆంజనేయులు , సోమ శంకర్, తడకమల్ల శ్రీధర్, చనగాని శేఖర్, తిరందాసు శ్రీను, పేర్ల గణేష్, దోటి శివ, భూతరాజు స్వామి, కటికం నరేష్, గండు శ్రీకాంత్, భూతరాజు వేణు , చిట్టిప్రోలు వెంకటేశం , గండూరి మల్లేష్ , భూతరాజు రామకృష్ణ, కోమటి ఓంకారం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button