తెలంగాణ
Trending

వంద బుల్డోజర్లు వస్తున్నయ్..ఒవైసీ కాలేజీని కూల్చేస్తం..ఆపే దమ్ముందా రేవంత్

హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బండ్లగూడ సలకం చెరువులో కట్టిన ఒవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజీ విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం దారుణమన్నారు. ఒవైసీ బ్రదర్స్ బెదిరించడంతో హైడ్రా పారిపోయిందన్నారు. అక్రమ కట్టడాలు కూల్చే దమ్ములేని రేవంత్.. చిల్లర మాటల బంద్ చేయాలన్నారు బండి సంజయ్. చెరువును కబ్జా చేసి కట్టిన కట్టడాలు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లపైకి అర్ధరాత్రి బుల్డోజర్లు పంపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి.. ఒవైసీ కాలేజీలు కనిపించడం లేదా అని నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి తోక ముడిచినా అక్రమ కట్టడాల విషయంలో తాము వెన్కకి తగ్గేది లేదన్నారు, సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ కాలేజీ భవంతులను బుల్డోజర్లతో కూల్చి వేసి తీరుతామన్నారు బండి సంజయ్. ఇందుకోసం వంద బుల్డోజర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. ఒవైసీ కాలేజీలను కూల్చకుండా ఆపే దమ్ముందా రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ సవాల్ చేశారు.

కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని, హైడ్రా కూల్చివేతల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు. సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా? అంటూ రేవంత్ ను ఉద్దేశించి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ అరాచకాలను అణిచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాతబస్తీ నుండి ప్రజాసంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఓవైసీకి చెందిన ఒక్కో బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button