జాతీయం

వేశ్యల ఇండ్లలోని మట్టితో దుర్గామాత విగ్రహాలు

కోల్ కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశాన్ని షేక్ చేసింది. బెంగాల్ లో ప్రకంపనలు రేపుతోంది. ట్రైనీ డాక్టర్ ను రేప్ చేసి చంపే ముందు నిందితుడు.. వేశ్యాగృహాలకు వెళ్లారని తేలింది. దీంతో కోల్ కతా వేశ్యలపైనా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై సెక్స్ వర్కర్లు సైతం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెడ్ లైట్ జిల్లాలోని సోనాగచిలోని కొంత మంది వేశ్యలు ఈ ఘటనను ఖండించారు. మహిళలు, యువతులపై అత్యాచారాలు చేయడం పట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ వద్దకు వస్తే వారికి, కాస్తంత రిలీఫ్ దొరుకుందని కూడా చెప్పారు.

ఈ ఘటన దుమారం కొనసాగుతుండగానే కోల్ కతా సోనా గచిలోని సెక్స్ వర్కర్లకు చెందిన ఒక వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. కోల్ కతాలో దుర్గామాత విగ్రహాల తయారీ కోసం వేశ్యల ఇండ్ల నుంచి మట్టిని తీసుకునిపోతారట. ఈ విషయాన్ని కోల్ కతా వేశ్యలే బహిరంగంగా చెప్పడం చర్చగా మారింది. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారంను పాటిస్తున్నారట.

ట్రైనీ ఘటన తర్వాత ఈసారి సోనాగచి వేశ్యలు తమ ఇంటి నుంచి దుర్గాపూజల విగ్రహాల తయారీకి మట్టిని ఇవ్వరనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై సోనాగచికి చెందిన కొంత మంది వేశ్యలు క్లారీటి ఇచ్చారు. వందల ఏళ్ల నుంచి తమ ఇంటి నుంచి నవరాత్రి దుర్గావిగ్రహాల తయారీకి మట్టి తీసుకెళ్తుంటారని చెప్పింది. కానీ కొంత మంది ఈసారి తాము.. మట్టిని ఇవ్వటానికి నిరాకరించినట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిలో ఏమాత్రం నిజంలేదని.. ప్రతి ఏడాది మాదిరిగానే.. తాము విగ్రహాల తయారీకి మట్టిని ఇస్తామంటూ కూడా సోనాగచి వేశ్యలు చెప్పారు.

నవరాత్రిని కోల్ కతాలో వైభవంగా నిర్వహిస్తారు. వేలాది దుర్గావిగ్రహాలను తయారు చేస్తుంటారు. అయితే అనాదీగా సెక్స్ వర్కర్ ల ఇంటి నుంచి కొంత మంది మట్టిని తీసుకొచ్చి, దుర్గాపూజల విగ్రహాంను తయారు చేసే మట్టిలో మిక్స్ చేస్తారు. ఇది అక్కడ అక్కడి సంప్రదాయం. ఈ క్రమంలో కొంత మంది మార్కెట్ లో సెక్స్ వర్కర్ ల ఇంటి నుంచి తెచ్చిన మట్టి అంటూ కూడా మోసాలకు పాల్పడుతున్నారని కూడా సోనాగచి వేశ్యవర్కర్ లు ఆవేదన వ్యక్తంచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button