తెలంగాణ

సాగు చేసే భూములకే రైతుబంధు ఇవ్వాలి… రైతుల డిమాండ్

సాగు చేసే భూములకే రైతుబంధు ఇవ్వాలి… రైతుల డిమాండ్…

చండూరు, (క్రైమ్ మిర్రర్)
చండూరు రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అదేశం మేరకు రైతు బందు పథకం పై రైతుల యొక్క అభిప్రాయములు మరియు సూచనలు తెలియజేయుట కొరకు సంఘ అధ్యక్షులు & డి.సి.సి.బి డైరెక్టర్ కోడి సుష్మా అధ్యక్షతన ప్రత్యేక సర్వ సభ్య సమావేశమ నిర్వహించారు. కార్యక్రమములో రైతులు వారి యొక్క అభిప్రాయములు మరియు సూచనలు తెలియజేయగా రాత పూర్వకంగా తీసుకొని తీర్మానం చేయడం జరిగినది. రైతులు ప్రధానంగా తెలిపిన విషయాలు ఇలా ఉన్నాయి. సాగు చేసే భూములకే రైతు బంధు వర్తించేలా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ భూములు సాగులో లేని భూములు కొండలు, గుట్టలు వంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఇవ్వకూడదని కోరారు. 10 ఎకరాల లోపు భూములు కలిగిన రైతులకు రైతుబంధు వచ్చేలా చూడాలని ఇందుకు ఎలాంటి షరతులు విధించొద్దని కోరారు. ఇచ్చే రైతుబంధును కూడా సకాలంలో ఇవ్వాలని. ఎరువులు,విత్తనాలు సబ్సిడీ పైన ఇవ్వాలని, రైతు బీమాను కచ్చితంగా కొనసాగించాలని అలాగే పంటల బీమాను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార ఆడిట్ అధికారి డిప్యూటీ రిజిస్టార్ గోలి శ్రీనివాస్ ,మునుగోడు ఫీల్డ్ సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ వంగూరి విజయ కృష్ణ , మండల వ్యవసాయ అధికారి రేవతి , చండూరు మండల క్లస్టర్స్ AEO లు మరియు గౌరవ పాలకవర్గ సభ్యులు సంఘ సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button