నల్గొండ

సోదరభావాన్ని పెంపొందించేవి గణపతి నవరాత్రులు… ప్రముఖ వ్యాపారి వరికుప్పల 

క్రైమ్ మిర్రర్ ప్రత్యేక ప్రతినిధి : వినాయక నవ రాత్రి వేడుకలను పురస్కరించుకుని గడియ గౌరారం గ్రామం లో అమ్మవారి అలయం లో ఏర్పాటుచేసిన గణనాథున్ని గుణమోని సైదులు, వెంకటమ్మ ల ఆహ్వానం మేరకు వ్యాపారా వేత్త వరికుప్పల వెంకట్రాములు, ఉజ్జిని ఏడుకొండలు రావు, ఉజ్జిని నరేందర్ రావు, గుణమోని జంగయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. వీరిని ఆలయ పూజారి వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వరికుప్పల వెంకట్రాములు మాట్లాడుతూ మనుషుల మధ్యన సోదర భావాన్ని పెంపొందించే ఈ నవరాత్రులను గడియ గౌరారం ప్రజలందరూ భక్తి భావంతో జరుపుకోవాలని కోరారు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలోప్రజలందరూ పూజలు చేసుకోవాలని సూచించారు. విజ్ఞములు తొలగించే వినాయకుడి కృప గడియ గౌరారం ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశు సంపద వృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జానీ ప్రభాకర్ శ్రీనూ, ఎం. జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button