క్రైమ్

హైదరాబాద్ ఓయో రూమ్‌లో సీసీ కెమెరాలు.. వీడియోలతో బ్లాక్ మెయిలింగ్

హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఓయో రూమ్ లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టారు ఓ దుర్మార్గుడు. రూమ్ లో దిగిన వాళ్ల వీడియోను చిత్రీకరించాడు. తర్వాత ఆ వీడియోలు చూపించి బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. ఓయోకు వస్తున్న యువతను టార్గెట్ చేస్తూ ఇంత నీచానికి పాల్పడిన ఓయో హోటల్ ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

హైదరాబాద్ శివారు శంషాబాద్ లో సిటా గ్రాండ్ పేరుతో ఒంగోలుకు చెందిన గణేష్ ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. శివారులో ఉండటంతో ఈ హోటల్ కు ఎక్కువగా యువత వచ్చేవారు. లవర్స్ రాసలీలకు ఇది అడ్డాగా మారింది. దీంతో హోటల్ కు వచ్చే యువతను టార్గెట్ చేసిన ఓవర్. . రూముల్లో రహస్యంగా కెమెరాలు పెట్టించారు. బెడ్ రూంలోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడ. అందులో రికార్జైన వీడియోలను .. ఆ జంటలకు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూల్ చేస్తున్నారు. చాలా మంది యువతి యువకులు అతనికి లక్షల్లో డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు.. ఓయో రూముల్లో అమర్చిన సీసీ కెమెరాలను గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాదీలను షేక్ చేస్తోంది. నగరంలో వేల సంఖ్యలో ఓయో హోటల్స్ ఉన్నాయి. చాలా వాటిలో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓయో హోటల్ కు వెళ్లడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button